Header Banner

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! వరి, పత్తి సహా 14 రకాల పంటల మద్దతు ధర పెంపు!

  Wed May 28, 2025 17:15        Politics

ఖరీఫ్ సీజన్ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచారు. ఈ పెంపు 2025-26 మార్కెటింగ్ సీజన్ నుండి వర్తిస్తుంది. నైజర్ సీడ్స్‌కు క్వింటాల్‌కు రూ.820 అత్యధికంగా పెంచగా, వరికి క్వింటాల్‌కు రూ.69 పెంచారు. రైతుల పెట్టుబడికి 50 శాతం మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు-నెల్లూరు జాతీయ రహదారికి నాలుగు లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు.


రోజురోజుకూ పెట్టుబడి వ్యయం పెరిగి వ్యవసాయం మరింత కష్టంగా మారుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలను పెంచుతూ తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కల్పించింది. ఈ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను.. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా మీడియాకు వివరించారు. 14 ఖరీఫ్ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచినట్లు వెల్లడించారు. ఇందులో ఆహార, వాణిజ్య, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటలు ఉన్నాయి.

 

ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిన ఈ పంటల మద్దతు ధర పెంపు 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు వర్తిస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. రైతుల పంట ఉత్పత్తికి అయ్యే వ్యయంపై కనీసం 1.5 రెట్లు కనీస మద్దతు ధర ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నైజర్‌సీడ్‌కు క్వింటాలుకు రూ.820 తో అత్యధిక పెంపు లభించిందని పేర్కొన్నారు. రాగి, పత్తి, నువ్వులకు కూడా గణనీయమైన పెంపు దక్కినట్లు వివరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు అధిక లాభాలు అందించడమే కాకుండా.. పప్పుధాన్యాలు, నూనె గింజలు వంటి ఇతర పంటల సాగును ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. 2014 తర్వాత దేశంలో వరి, ఇతర ఖరీఫ్ పంటల సేకరణ.. ఎంఎస్పీ చెల్లింపులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: రూ.లక్షలోపు రుణమాఫీ.. వీరికి వర్తింపు! మార్గదర్శకాలు జారీ!


2018-19 కేంద్ర బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఈ కనీస మద్దతు ధర పెంపు జరిగిందని వివరించారు. నైజర్‌సీడ్‌కు క్వింటాలుకు రూ.820తో అత్యధిక ఎంఎంస్పీ లభించింది. రాగులకు రూ.596, పత్తికి రూ.589, నువ్వులకు రూ.579 చొప్పున మద్దతు ధరను పెంచారు. క్వింటాల్‌ వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు ధర రూ.2369కి చేరింది. పప్పు ధాన్యాల విషయానికి వస్తే కందులు రూ.450, పెసర్లు రూ.86, మినుములు రూ.400 పెంచారు. నూనె గింజల విషయానికి వస్తే. వేరుశనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్‌కు రూ.436 చొప్పున పెంచారు.

 

2018-19 కేంద్ర బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఈ కనీస మద్దతు ధర పెంపు జరిగిందని వివరించారు. నైజర్‌సీడ్‌కు క్వింటాలుకు రూ.820తో అత్యధిక ఎంఎంస్పీ లభించింది. రాగులకు రూ.596, పత్తికి రూ.589, నువ్వులకు రూ.579 చొప్పున మద్దతు ధరను పెంచారు. క్వింటాల్‌ వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు ధర రూ.2369కి చేరింది. పప్పు ధాన్యాల విషయానికి వస్తే కందులు రూ.450, పెసర్లు రూ.86, మినుములు రూ.400 పెంచారు. నూనె గింజల విషయానికి వస్తే. వేరుశనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్‌కు రూ.436 చొప్పున పెంచారు.

 

అదే సమయంలో దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారుల నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు- నెల్లూరు హైవే 4 లైన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అలాగే వార్దా-బల్లార్ష హైవే 4 లైన్ల నిర్మాణం.. రత్లాం నాగాడా హైవే నాలుగు లైన్ల నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?


గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!


వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!


విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!


తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!


కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!


కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!


విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #FarmersFirst #MSPHike #GoodNewsForFarmers #PaddyMSP #CottonMSP #AgricultureIndia